Saturday, July 27, 2024

ఒంగోలు అత్యాచార ఘటనపై హోంమంత్రి తానేటి వనిత ఆరా

రాష్ట్రంలోని ఒంగోలులో జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఆరా తీశారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి హోంమంత్రి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలికి అవసరమైన వైద్యం అందించాలని హోంమంత్రి ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు. ఇద్దరు నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. ఒకరిని అరెస్ట్ చేశామని, ఇంకొకరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement