Tuesday, May 21, 2024

భూపాలపల్లి జిల్లాలో టైగ‌ర్ సంచారం..

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద‌పులి సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. జిల్లాలోని మల్హార్ మండలం మల్లారం పెద్ద గుట్టల సమీపంలో పులి రోడ్డు దాడుతుండగా లారీ డ్రైవర్ గమనించాడు. విషయం తెలిసిన స్థానికులు పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశువులను మేపేందుకు అటవీ ప్రాంతాలకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. పెద్ద‌పులి సంచ‌రించిన విష‌యం తెలియ‌డంతో ఆప్రాంత ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement