Monday, April 29, 2024

TS: అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి.. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : పోచంపల్లిలో చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించి తనను గెలిపించాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఆయన ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. గడపగడపకు వెళ్లి ఓటర్లను కలిసి మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి ముందుకు సాగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా సంక్షేమ పాలనలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా మ్యానిఫెస్టోలో నిర్ణయించారన్నారు. అన్నివర్గాల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సీత వెంకటేశం, వైస్ చైర్మన్ బాతక లింగస్వామి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తడక రమేష్, జింకల యాదగిరి, వంగూరి పెంటయ్య, చేరాల నరసింహ, సంగెం చంద్రయ్య, ప్రభాకర్ చారి, కో ఆప్షన్ సభ్యులు సుల్తానా షరీఫ్, అజ్జు, జల్ది నరసింహ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement