Monday, April 29, 2024

NLG: ఒకవైపు పాలాభిషేకాలు.. మరోవైపు రాస్తారోకోలు..

సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 3 (ప్రభ న్యూస్): తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేస్తామని తెలపడంతో తెలంగాణ రాష్ట్ర రైతులు, పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని 28 రోజులుగా సమ్మె చేస్తున్నారు.

ఒకవైపు రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే త్వరలో తమ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే పాలాభిషేకాలు చేస్తామంటూ గ్రామపంచాయతీ కార్మికులు వేడుకుంటున్నారు. ఈ దృశ్యం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఒకేచోట పాలాభిషేకాలు, సమ్మె కార్యక్రమాలు జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement