Monday, May 6, 2024

అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి.. కలెక్టర్ పమేలా సత్పతి

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలెవరూ తమ ఇళ్ల నుండి బయటికి రావొద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం జిల్లాలోని రాజాపేట, యదగిరిగుట్ట మండలాల్లోని రహదారులను, వాగులను పరిశీలించారు. భారీ నుండి అతి భారీ వర్షాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


పాతబడిన ఇళ్లలో, శిథిలావస్థకు చేరిన ఇళ్ళలో, నీటికి బాగా నానిన ఇళ్ళల్లో ఉండరాదని, దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హాల్, గ్రామ పంచాయతీ భవనం, పాఠశాలల్లో ఉండాలని కోరారు. ఆయా గ్రామాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
అధికారులందరూ ఎలాంటి నష్టం జరగకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి, అందులో ఉన్న నివాసితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు వచ్చినా కంట్రోల్ రూమ్ నెంబర్ 08685 – 293312, వాట్సాప్ నెంబర్ 9121147135 వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement