Monday, April 29, 2024

NLG: కాంగ్రెస్ పార్టీతోనే పేదల అభివృద్ధి..

ప్రభ న్యూస్, పెన్ పహాడ్, నవంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే పేదలు అభివృద్ధి చెందారని మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు అన్నారు. ఇవాళ మండల పరిధిలోని పొట్లపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, అర్హులందరికీ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీములు అమలు కావాలంటే సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు పిన్నేని కోటేశ్వరరావు, రామినేని పుష్పావతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లంకొండ శ్రీరాములు, ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు, కొణిదల రాంబాబు, మేకపోతుల చిన్న లింగయ్య, నారాయణ శ్రవణ్ రెడ్డి, గుత్తికొండ సత్యనారాయణ, ఎగ్గడి యాదగిరి, పటాన్ షకీల్, నారాయణ రామ్ రెడ్డి, మేకపోతుల సైదులు, కృష్ణ, గంగారపు, సంజీవ సురేష్, నవీన్, శ్రీను, నరసయ్య, లెనిన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement