Thursday, May 2, 2024

Protest with Posters – బోధ‌న్ లో రాహుల్ కు పోస్ట‌ర్ల‌తో నిర‌స‌న సెగ

నిజామాబాద్ : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేడు బోధన్ పర్యటన నేపథ్యంలో ఆయన రాకను నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే నిజామాబాద్, బోధన్‌లో గోడలకు పోస్టర్ల ప్రత్యక్షం అయ్యాయి.ఈ పోస్టర్లలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫోటోలను పెట్టి బలిదానాల బాధ్యత కాంగ్రెస్‌దే. మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నా రు. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే… ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్ చేస్తూ పోస్టర్లు వెలిశాయి.

పోస్టర్లలో కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగాన్ని ఎండగట్టిన వైనాన్ని ముద్రించారు. పోస్టర్లలో బళ్లారిలో జీన్స్ పరిశ్రమలకు విద్యుత్తు కోతలపై పత్రికల్లో వచ్చిన కథనాలు ఉదహరించారు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి కరెంటు లేక అల్లాడుతున్న కర్నాటక అని విమర్శ ఉన్నాయి. కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరామా అని ఉన్న ప్రశ్నలు పోస్టర్‌పై రాశారు. కర్నాటకలో ఉద్యోగాలు కాదు ఉరితాళ్లే అంటూ రాతలు రాశారు. ఈ పోస్ట‌ర్లు ఎవ‌రు వేశార‌నే విష‌యంపై కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement