Saturday, May 18, 2024

Devarakonda – గత తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజలతో ఉన్నాం … తిరిగి వాళ్ల ఆశీర్వాదం పొందుతాం .. ఎమ్మెల్యేరమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ – నియోజకవర్గంలో గత 9 ఏండ్లలో జరిగిన అభివృద్ధి, ఇంటింటికీ పకడ్బందీగా అమలవుతున్న సంక్షేమ పథకాలే కారు గుర్తు కు ఓటు బ్యాంక్ అని దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శుక్రవారం కొండమల్లేపల్లి మండలం వాడిత్య తండా,గాజినగర్,చింతచెట్టు తండా,కోల్ ముంతల్ పహాడ్,రమునిగుండ్ల తండా, కొత్తబావి,కెశ్య తండా,గుర్రపు తండా, దంజిలాల్ తండా,గాన్య నాయక్ తండా,అంగోతు తండా, చేన్నారం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పోటీకి ఎవరిని నిలబెట్టాలనే సందిగ్ధత లో కాంగ్రెస్….రాజకీయ ప్రత్యర్ధి పేరును ఖరారు చేయడంలో అంతర్మథనంలో ఉన్నారు అని ఆయన అన్నారు.దేవరకొండ ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ వల్లే జరిగింద‌ని, . ఇకపై కూడా అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అని ఆయన తెలిపారు.

ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్,జడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగేందర్ రెడ్డి,రైతు బంధు అధ్యక్షుడు కేసాని లింగా రెడ్డి,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు రమావత్ తులిసిరామ్,గ్రామాల అధ్యక్షులు,సర్పంచులు,ఎంపీటీసీలు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement