Friday, May 3, 2024

NLG : విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి

మోత్కూర్, ఏప్రిల్ 23(ప్రభ న్యూస్) విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి చెందిన సంఘ‌ట‌న యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి కురిసిన భారీ ఈదురుగాలులతో పొలంలో మెయిన్ లైన్ వైరు తెగిపడిపోయింది. జిట్ట బుచ్చమ్మ కు చెందిన పాడి గేదెను మేతకు తీసుకెళ్ల‌గా పొలంలో పడి ఉన్న మెయిన్ లైన్ విద్యుత్ తగిలి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో రైతు బుచ్చమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం నిరుపేద మహిళకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement