Thursday, May 2, 2024

TS: మునుగోడులో బీఎస్పీ నాయకుల అరెస్ట్

మునుగోడు, ఆగస్టు 30 (ప్రభ న్యూస్):బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై మంత్రి జగదీష్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులు, వేధింపులకు నిరసనగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా కేంద్రానికి సంఘీభావ ధర్నాకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారు.

ఇలా అరెస్ట్ చేయడం అన్యాయమని, దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నిర్బంధాలు చేసినా తమ పోరాటం ఆగదని, బీసీ బిడ్డకు ఖచ్చితంగా అండగా నిలబడి, న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ మండల అధ్యక్షుడు పందుల హరీష్, జిల్లా నాయకులు జనార్ధన్, తీగల రమేష్, పట్టణ అధ్యక్షుడు పందుల వెంకన్న, మండల ఉపాధ్యక్షుడు గోలి ప్రవీణ్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement