Saturday, May 4, 2024

TS | ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ బిఆర్ఎస్ రాస్తారోకో..

మోత్కూర్, (ప్రభ న్యూస్) : ఢిల్లీ లిక్క‌ర్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసినందుకు నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ సెంటర్‌లోని స్థానిక అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాకూబ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పొన్నె బోయిన రమేష్, మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కొండ సోoమల్లు, బిఆర్ఎస్ జిల్లా నాయకులు చౌగోని సత్యం, ఓయూ జెఏసి రాష్ట్ర నాయకులు మర్రి అనిల్ కుమార్, మాజీ ఎంపీటీసీ లు జంగ శ్రీను,పానుగుళ్ళ విష్ణు,మొరిగాల వెంకన్న, కూరెళ్ల పరమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement