Saturday, April 27, 2024

రోడ్డు ప్రమాదం లో అక్కా తమ్ముడు మృతి..

సూర్యాపేట(రూరల్),ప్రభ న్యూస్: రోడ్డు ప్రమాదం లో అక్కా తమ్ముడు మృతిచెందిన సంఘటన
బాలెంల వజ్రరైస్ ఇండస్ట్రీస్ సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం టాటా ఏస్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో గాంధీ నగర్ గ్రామానికి చెందిన పెద్దబోయిన రజిత(35),కోమటిపల్లి కి చెందిన మండ్ర శేఖర్(25)లు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోమటిపల్లిలో బొడ్రాయి పండుగకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొంటున్నారు. మృతుడు శేఖర్ అక్కను పండుగకు తీసుకుపోయే క్రమంలో ప్రమాదం జరగటం కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement