Saturday, April 27, 2024

నాచుపల్లి JNTUకి న్యాక్ ఏ+ గుర్తింపు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూకి న్యాక్ ఏ+ గుర్తింపు లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాంలో ఈ కళాశాలను నిర్మించారు. నాక్ గుర్తింపు రావడం పట్ల చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు పలుమార్లు లేఖలు రాయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ లేఖలు రాయించారని, వారి కృషి ఫలితమే నేడు గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement