Thursday, April 25, 2024

మిస్టరీ మరణాలు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

అంతుచిక్కని వ్యాధితో ఇటీవల తల్లి మమత,కుతురు అమూల్య(6),కుమారుడు అధ్వైత్ ( 20 నెలలు) మృతి చెందారు. ఆ విషాదం నుండి తేరుకోక ముందే మమత భర్త శ్రీకాంత్ రాత్రి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లాలోని గంగాధరలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఇంట్లో రక్తం కక్కు కోవడంతో శ్రీకాంత్ ని హాస్పిటల్ తరలించారు కుటుంబ సభ్యులు. ఇటివల మృతుల కుటుంబ సభ్యుల రక్త నమునాలని సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కి పంపారు వైద్య సిబ్బంది. ఎలా చనిపొయారో అర్థం కావడం లేదని అంతుచిక్కని వ్యాధి ముగ్గురి ప్రాణాలని బలి తీసుకుందని చెప్పాడు శ్రీకాంత్.కాగా ఇప్పుడు శ్రీకాంత్ మరణం మిస్టరీ గా మారింది. అయితే ముగ్గురు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తు మమత కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేసారు. గంగాధర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలోనే శ్రీకాంత్ సైతం మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement