Wednesday, May 1, 2024

Breaking | నా ప‌ర్సుపోయింది, దొర‌క్కుంటే చ‌స్తా.. స్టేష‌న్ పైకెక్కి యువ‌కుడి బెదిరింపు

నా ప‌ర్సుపోయింది. అది క‌నుక దొర‌క్కుంటే నేను చ‌స్తా.. అంటూ ఓ యువ‌కుడు పోలీస్ స్టేష‌న్ పైకెక్కి హ‌ల్‌చ‌ల్ చేశాడు. ఈ ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ టౌన్‌లో ఇవ్వాల (ఆదివారం) జ‌రిగింది. చింటూ అనే యువకుడు పోలీసుల‌నే బెదిరించిన ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

అతన్ని మాటల్లో పెట్టి బిల్డింగ్ మీద నుంచి కిందికి తీసుకువచ్చారు. తన మ‌నీ పర్సు పోయిందని కంప్లెయింట్ చేసినా పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆ యువ‌కుడు ఆరోప‌ణ చేశాడు. అందుకే మ‌న‌స్తాపంతో తాను ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టు చెప్పాడు. అయితే ఆ యువకుడు ఫుల్‌గా మ‌ద్యం తాగి ఉండ‌డం వ‌ల్లే ఇలా చేశాడ‌ని, అతనో సైకో అని పోలీసులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement