Saturday, May 4, 2024

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

వికారాబాద్ టౌన్ ఆగస్టు 6(ప్రభన్యూస్ )తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఆదివారం జిల్లా కేంద్రమైన వికారాబాద్ లో ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జ‌య‌శంక‌ర్ సార్ త‌న జీవితాంతం క‌ష్ట‌పడ్డార‌ని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పేర్కొన్నారు. తెలంగాణ భావ‌జాల వ్యాప్తికి నిరంత‌రం కృషి చేశార‌ని తెలిపారు. జ‌య‌శంక‌ర్ ఆశ‌యాల సాధాన‌కు చిత్త‌శుద్ధితో తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంద‌న్నారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో ఆయ‌న చేసిన సూచ‌న‌లు, స‌ల‌హాలు భ‌విష్య‌త్ త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలుగా నిలుస్తాయ‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్ బిఆర్ ఎస్ కృష్ణ, తిమ్మని శంకర్ నాయకులు ప్రజాసంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement