Tuesday, April 30, 2024

Muthol – బోరున విలపించిన‌ బిజెపి నేత ర‌మాదేవి … టిక్కెట్ రాక‌పోవ‌డంతో పార్టీకి గుడ్ బై

భైంసా, : ముథోల్‌ టికెట్‌ తనకు ఇవ్వకుండా బీజేపీ అధిష్ఠానం అన్యాయం చేసిందని ఆ పార్టీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదేండ్ల నుంచి పార్టీకి కష్టపడి పనిచేస్తే గుర్తింపు దక్కలేదని వాపోయారు.
ఏడాది కిందట పార్టీలోకి వచ్చిన వారికి బీజేపీ టికెట్‌ ఇచ్చిందని మండిపడ్డారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా.. రాష్ట్రంలోని బీజేపీ అభ్యర్థుల కంటే తనకే అధిక ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని, బీజేపీకి గుణపాఠం చెప్తానని హెచ్చరించారు. శ్రమకు గుర్తింపు ఇవ్వనికి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement