Friday, May 10, 2024

బసవయ్య పల్లిలో దారుణ హత్య

దేవరకద్ర ఆగస్టు 25 ప్రభ న్యూస్ ఒక వ్యక్తి దారుణ హత్యకు గురి అయిన సంఘటన మండల పరిధిలోని బసవ య పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిందని గ్రామస్తులుతెలిపారు. గ్రామస్తుల కథనము ప్రకారము సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బోయ నాగరాజు అనే వ్యక్తి తన వ్యవసాయ పొలం ముగించుకొని బైక్ పై ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దారి కాచి గొడ్డలితో దారుణ హత్య చేయడం జరిగిందని గ్రామస్తుల తెలిపారు.

ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ పోలీసులకుసమాచారం ఇవ్వగ స్థానిక ఎస్సై వెంకటేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ జరిగిన పూర్తి వివరాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదని ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement