Sunday, April 28, 2024

అంతయ్య మృతదేహం లభ్యం

ఆరు రోజుల క్రితం గల్లంతైన మున్సిపల్ కార్మికుడు అంతయ్య మృతదేహం లభ్యమైంది. గల్లంతయిన ప్రదేశం నుంచి 200 మీటర్ల దూరంలోనే 800mm డయ సివర్ ట్రంక్ పైపు లైన్ లో లభ్యమైంది. కోయంబత్తూర్ టెక్నాలజీ వినియోగంలో భాగంగా ఓ కెమెరాను సివర్ ట్రంక్ పైపు లైన్ లోకి పంపగా మృతదేహాన్ని గుర్తించారు.

కాగా, గత వారం వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ లో కార్మికుడు రాత్రిపూట మ్యాన్ హోల్‌లోకి దిగిన ఇద్దరు జీహెచ్‌ఎంసీ కార్మికులు ప్రాణాలు విడిచారు. వరద నీటి కాలువలో సిల్ట్ తీసేందుకు దిగిన కార్మికులు శివ, అంతయ్య చనిపోయారు. శివ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతయ్య మృతదేహాం గల్లంతైంది. ఐదు రోజులుగా అంతయ్య డెడ్ బాడీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ మృతదేహాన్ని గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement