Wednesday, May 1, 2024

Mulugu -‘ రాళ్ల దాడిలో ఆర్టీసీ బస్సు ,కారు అద్దాలు ద్వంసం

(ప్రభ న్యూస్):ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో జనగాలంచ సమీపంలో వాహనాలపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడం తో ఆర్టీసీ బస్సు ,కారు అద్దాలు ద్వంసం అయ్యాయి. హన్మకొండ నుంచి ఏటుర్ నాగారం వెళ్లే వాహనదారులు ఎవరు ఈ దాడికి పాల్పడుతున్నారని, ఏం జరుగుతుందోననీ తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

ఈ విషయం పై వాహనదారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు .. ఎవరు? ఎందుకు రాళ్లు విసురుతున్నరనే కోణంలో విచారణ చేపట్టారు .ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement