Tuesday, May 21, 2024

HYD: మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంత్రి హ‌రీశ్ రావు స‌మ‌క్షంలో రామ్మోహన్ గౌడ్ దంప‌తులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ…. పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని, ఒకే కుటుంబంలో విభేదాలు సహజం, సహచరుడిని కాపాడుకోవాలని వచ్చామని మంత్రి హరీష్ రావు తెలిపారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేశాడన్నారు.

ముక్కు సూటి తత్వం ఉన్న మనిషి రామ్మోహన్ గౌడ్ అన్నారు. పార్టీ రెండుసార్లు టికెట్ ఇచ్చింది కానీ స్వల్ప మెజార్టీతో ఓడిపోయారన్నారు. అయినా జిహెచ్ఎంసి ఎన్నికల్లో 11 మంది కార్పొరేటర్లను గెలిపించారన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తామ‌న్నారు. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయన్నారు. రామ్మోహన్ గౌడ్, అతని అనుచరుల ప్రాధాన్యత విషయంలో పార్టీ ప్రతినిధిగా తాను బాధ్యత తీసుకుంటానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement