Monday, May 6, 2024

రైత‌న్న‌కు వెన్నుద‌న్నుగా ధ‌ర్నాలో చేవెళ్ల‌ ఎంపీ రంజిత్ రెడ్డి

రైతన్నకు వెన్నుద‌న్నుగా…చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ TRS పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి కట్టుగా ఇందిరా పార్క్ ధ‌ర్నాలో చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి.రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో, కేంద్ర ప్రభుత్వం తీరుకి నిరసనగా టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, త‌దిత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి సీఎం కేసిఆర్ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన మహాధర్నా కార్యక్రమంలో చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి.రంజిత్ రెడ్డి ప్లకార్డును పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతు శ్రేయస్సు కోసం పెద్ద ఎత్తున తరలివచ్చి చేస్తున్న ఈ మహా ధర్నాను చూసైనా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఎంపీ వెంట ఎమ్మెల్యేలు అరికేపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కేపి వివేకానంద్, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement