Monday, April 29, 2024

కూతురిని ట్రైన్ లో నుంచి తోసేసిన తల్లి!

పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురినే ఓ తల్లి ట్రైన్‌లో నుంచి కిందకు తోసేసింది. పెద్దపల్లి మండలం గొల్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన పాపను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాపకు అంగవైకల్యం ఉండడం వద్ద తల్లి ఇంతటి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాప క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పాపను రైలులో నుండి తల్లి లేక ఎవరైనా నెట్టివేశర లేక పాపనే జారీ పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement