Wednesday, April 24, 2024

దేశంలో కొత్తగా 43 వేల కేసులు..911 మంది మృతి..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చినప్పటికి కొన్ని రోజులుగా కొత్తగా వచ్చే కేసుల సంఖ్య నిలకడగా ఉంటోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,393 క‌రోనా కేసులు నమోదైయ్యాయి. అలాగే, 24 గంట‌ల్లో 44,459 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,52,950కు చేరింది. మరణాల విషయానికొస్తే, నిన్న‌ 911 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,05,939కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,98,88,284 మంది కోలుకున్నారు. 4,58,727 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 36,89,91,222 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న‌ 40,23,173 డోసులు వేశారు. దీంతో వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య 36,89,91,222 చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.

ఇది కూడా చదవండి: ఈ ఏడాది థర్డ్ వేవ్ ఉండదు: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement