Monday, April 29, 2024

మోకిల ఫేజ్ 2 వేలం నోటీస్ …గ‌జం రూ.25 వేలుగా ప్రారంభ ధ‌ర

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో మ‌రో భారీ భూవేలానికి హెచ్ఎండీఏ సిద్ధ‌మవుతోంది. మోకిల ఫేజ్-2 భూముల వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేష‌న్ జారీ చేసింది. 300 ప్లాట్ల‌లో 98,975 గ‌జాల‌ను అమ్మ‌కానికి పెట్టింది. ఈ లే ఔట్‌లో 300 నుంచి 500 గ‌జాల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఆగ‌స్టు 21వ తేదీ వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్‌కు అవ‌కాశం క‌ల్పించారు. రూ. 1,180 చెల్లించి రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు. వేలంలో పాల్గొనే వారు రూ. ల‌క్ష డిపాజిట్ చేయాలి.

చ‌ద‌ర‌పు గ‌జానికి రూ. 25 వేలుగా క‌నీస ధ‌ర నిర్ణ‌యించింది హెచ్ఎండీఏ. 98,975 గ‌జాల అమ్మ‌కంతో రూ. 800 కోట్లు రావొచ్చ‌ని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. మోకిల ప్లాట్లు తొలి విడుత వేలంలో గ‌రిష్ఠంగా గ‌జానికి రూ. 1.05 ల‌క్ష‌లు ప‌లికాయి. క‌నిష్ఠంగా గ‌జానికి రూ. 72 వేలు ప‌లికాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement