Monday, April 29, 2024

ఇవాళ ధర్నాచౌక్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష..

మహిళలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం చేసే ఈ జీవోకు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేప‌ట్ట‌నున్నారు. ఈ మేర‌కు శుక్రవారం తెల్లవారుజామున కవిత దీక్షకు పోలీసులు అనుమతి జారీ చేశారు. ధర్నా చౌక్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయ‌నున్నారు.

- Advertisement -

జీవో నంబర్‌ 3ను రద్దు చేయాలని డిమాండ్‌ చేయనున్నారు. ఈ జీవో వల్ల ప్రభుత్వ నియామకాల్లో మహిళల రిజర్వేషన్ల అమలులో తీవ్ర అన్యాయం జరుగుతుందని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు జీవో-3 వల్ల జరిగే నష్టం గురించి ధర్నాల్లో వివరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement