Saturday, April 27, 2024

Delhi: ఎమ్మెల్సీ క‌విత‌కు రిమాండ్ పొడిగింపు.. తీహార్ జైలుకు త‌ర‌లింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో ఆమెను ఈడీ అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే కోర్టు క‌విత రిమాండ్ ను ఏప్రిల్ 9వ‌తేదీ వ‌ర‌కు పొడిగించింది. ఆమెను తీహార్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. కాసేపట్లో కవితను తీహార్ జైలుకు పోలీసులు తరలించనున్నారు. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురయ్యారు.

మరోవైపు, కవిత బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, తనకు మధ్యంత బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, ఆమె విన్నపాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇంకోవైపు, కవితను మరో 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరినప్పటికీ… ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement