Sunday, April 28, 2024

కాంగ్రెస్ పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు మిగిలింది క‌న్నీళ్లే …ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి…

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (సెప్టెంబర్ 1) ప్రభా న్యూస్…ప్రజలకు కావాల్సిన మరిన్ని సౌకర్యాల కోసం మర్రెన్న పది సంవత్సరాల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టానని, ప్రతిపక్షాలు ఓటమి భయంతో పాదయాత్రను తప్పుదోవ పట్టిస్తున్నాయని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు కన్నీరే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలకులు నిరంతరం ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి అండగా ఉండడం నాయకుడి ధర్మం అని స్పష్టం చేశారు. గ్రామానికి వెళ్లినా ఇండ్లు, పింఛన్లు మాత్రమే అడుగుతున్నారని అవి వారికి త్వరగా అందేలా కృషి చేస్తానని వెల్లడించారు. మంచిపని చేస్తుంటే కొందరు అడ్డుపడటం సరికాదని దానివల్ల ప్రజలకు చేయాల్సిన సేవలకు అడ్డంకి మారుతుందని సూచించారు.ఇంజనీరింగ్ కాలేజి, మండలాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాజకీయాలకు డబ్బు పదవి కోసం రాలేదని తెలియజేశారు. నెలలో వట్టెం రిజర్వాయర్ ప్రారంభించి 1.75లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇస్తామని తెలియజేశారు. యాత్రను తప్పుదోవ పట్టించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని అది మంచి పద్ధతి కాదని హితవు పలికారు ఈ సమావేశంలో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్, డిసిసిబి డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement