Monday, April 29, 2024

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే గండ్ర ఫైర్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి తీవ్రగా ఫైర్ అయ్యారు. జయశంకర్ జిల్లాకు కేంద్రమంత్రి వస్తున్నాడంటే ఏమైనా ఫండ్స్ తీసుకువస్తాడని ఆశపడ్డామడన్నారు. కానీ వట్టి చేతులతో వచ్చి వెళ్లారని ఎద్దేవాచేశారు. అధిపత్యం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి.. తెలంగాణ ప్రజలకు ఏమీ చేయలేక పోయాడన్నారు. కిషన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఉత్తి రబ్బర్ స్టాంప్ అని ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో కీలుబొమ్మ అని వ్యాఖ్యానించారు. వెనుకబడిన జిల్లా అని చెప్పి భూపాలపల్లికి ఏమైనా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. కాకతీయ రాజుల కాలం నాటి భూపాలపల్లి జిల్లాలో ఎన్నో సుందర పర్యటన, పురాతన ప్రాంతాలు, ఆలయాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. కాళేశ్వరంకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా  ఏమైనా ఇచ్చిందా చెప్పాలని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధంగానే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ప్రజల కోరిక మేరకే టీఆర్ఎస్ లో చేరామన్నారు. తెలంగాణలో బిజెపి గెలవడం అసాధ్యం అని,రాబోయే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement