Friday, May 3, 2024

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం: ఎమ్మెల్యే దాసరి

ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి పట్టణంలోని 3వ వార్డులో సీసీ డ్రెయిన్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లిలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. పెద్దపెల్లి పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రానికి తగ్గట్టుగా సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement