Thursday, April 25, 2024

పేలిన కారు టైర్లు : ఇద్ద‌రు మృతి

కారు రెండు టైర్లు పేలిపోవ‌డంతో జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెంద‌గా, మ‌రో ఆరుగురికి గాయాలైన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ ప్ర‌మాదం పెళ్లికి వెళితే చావు ఎదురొచ్చింది అన్నట్లుగా జ‌రిగింది. వాళ్లంతా ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా ఓ కారు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్ సమీపంలో సాగర్ రహదారిపై ఈ కారు ప్రమాదం జరిగింది. వివాహానికి హాజరై ఇంటికి వస్తుండగా.. అదుపు తప్పి కారు రెండు టైర్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందిలో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన ఆరుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌ లింగంపల్లి నుంచి యాచారం మండలం మాల్‌లో జరిగిన వివాహానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌మాదంలో మృతులు వట్టినాగులపల్లికి చెందిన తలపల్లి రామకృష్ణ, మటూరి శ్రీకాంత్ గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు. కారు వేగంతో వెళుతుండటంతో వాహన టైర్లు పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement