Monday, May 6, 2024

దేశం కేసీఆర్ కోసం ఎదరు చూస్తోంది: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ లా మారారని పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలో 192 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డల వివాహాలు తల్లిదండ్రులకు భారం కావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. పేదింటి ఆడబిడ్డలు వివాహానికి సీఎం కేసీఆర్ మేనమామ పాత్ర పోషించి లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కల్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ లాంటి ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన కెసిఆర్, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపే సత్తా ఉన్న నాయకుడన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. భారతదేశమంతా కేసీఆర్ లాంటి మహా నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement