Saturday, May 4, 2024

మంచిర్యాలలో మెగా రక్తదాన శిబిరం

ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలుచేసి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ సంక్షేమ ప్రదాత అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మూడు రోజులపాటు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎన్నో పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావుతో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement