Friday, May 3, 2024

వైద్య రంగంలో నర్సుల సేవా ఎంతో గొప్పది – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ – వైద్య సేవలో నర్సుల సేవా ఎంతో గొప్పదనీ, నర్సు లు..భగవంతుడు ప్రసాదించిన వరమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వారి సేవలను కొనియా డారు. మదర్ థెరిస్సా వారసులని ఎలాంటి కల్మషం లేకుండా పేషంట్స్ కి నర్సులు అందించే సేవా ఎంతో గొప్పది,వెలకట్టలేనిదన్నారు. అంతర్జాతీయ నర్స్ ల దినోత్సవం పురస్కరిం చుకొని నేడు జిల్లా ప్రభుత్వ దవాఖాన లో నర్సులు, వైద్యబృందంతో కలిసి వేడుకల్లో పాల్గొని,కేక్ కట్ కట్ చేసి వారికి అంతర్జాతీయ నర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బం గా నర్సింగ్ సూపరింటెండెంట్లు ఎం ఎస్ వి. ఎల్ పార్వతి, పారిజా తంలను మంత్రి సన్మానించి నర్సింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ నర్సింగ్ సిబ్బంది సేవలు అమోగమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు పేషెంట్ల పట్ల నర్సింగ్ సిబ్బంది చూపే శ్రద్ధ శ్లాఘనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్లు డాక్టర్ నాగేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement