Monday, April 29, 2024

TS: మంత్రి సురేఖ‌కు డెంగీ జ్వరం..

మంత్రి కొండా సురేఖ డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో జ్వరం బారిన పడిన‌ట్టు స‌మాచారం. అయిదు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో డాక్ట‌ర్లు పలు వైద్య పరీక్షలు చేసి డెంగీ పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో డాక్ట‌ర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.

మేడారం జాతర పనుల పురోగతి, ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకుంటూ.. అవసరమైన సూచనలు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో కోలుకొని, మేడారం సమ్మక్క-సారక్క జాతరలో పాల్గొంటార‌ని మంత్రి సురేఖ‌ స‌హాయ‌కులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement