Sunday, May 19, 2024

మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృవియోగం

మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి లింగ్యా నాయక్ (85) ఈరోజు ఉదయం 3.30 గంటలకు పరమపదించారు. లింగ్యా నాయక్ అంత్య క్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్ద తండాలో జరగనున్నాయి.

మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ ను ఫోన్లో సీఎం కేసిఆర్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement