Friday, May 17, 2024

దేశంలో కొత్తగా 30 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30,757 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ తో మరో 541 మంది మరణించారు. అదే సమయంలో 67,538 మంది బాధితులు కోలుకున్నారు.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,54,315కి చేరగా.. ఇందులో 4,19,10,984 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,32,918 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 5,10,413 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగంగానే కొనసాగుతోంది. నిన్న 34,75,951 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,74,24,36,288కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement