Thursday, May 2, 2024

కేంద్రానికి వ్య‌తిరేకంగా మంత్రి కేటీఆర్ ట్వీట్- లైక్ కొట్టిన స‌మంత‌

ఇన్ స్టా గ్రామ్ లో మంత్రి కేటీఆర్ చేసిన ఒక పోస్ట్ కి స్టార్ హీరోయిన్ స‌మంత లైక్ కొట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్ ఈ పోస్ట్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో కేటీఆర్ చేసిన పోస్ట్ ఏమిటంటే… ‘దేశ జనాభాలో కేవలం 2.5 శాతం జనాభా మాత్రమే ఉండే తెలంగాణ… దేశ జీడీపీలో 5 శాతాన్ని అందిస్తోంది. (సోర్స్: ఆర్బీఐ రిపోర్ట్ అక్టోబర్ 2021). ఈ దేశానికి కావాల్సింది డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కాదు. డబుల్ ఫలితాలను ఇచ్చే పాలన అని ఆయన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు సమంత లైక్ కొట్టింది. తెలంగాణ చేనేతకు సమంత బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement