Friday, May 17, 2024

డాక్టర్ రాజారెడ్డి అంతిమయాత్ర పాల్గొన్న మంత్రి కొప్పుల

జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రస్తుత ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తండ్రి రాజారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ధర్మపురిలో రాజారెడ్డి అంతిమ వీడ్కోలు యాత్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. రాజారెడ్డికి ఘన నివాళులర్పించారు. ఎల్లాల కుటుంబ సభ్యులను పరామర్శించి, మంత్రి ఓదార్చి మనోధైర్యాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement