Sunday, May 5, 2024

Harish Rao : సిద్దిపేటలో ఓటు వేసిన మంత్రి హ‌రీష్‌రావు

సిద్దిపేటలోని మంత్రి హ‌రీష్‌రావు దంప‌తులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లోనీ మాడల్ పోలింగ్ బూత్ నెం114 లో కుటుంబ సమేతంగా ఓటు వేశారు. అనంత‌రం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాజిటివ్ ఓటింగ్ జరుగుతుందన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలు ఉత్సహకంగా పాల్గొంటున్నారని, గతంలో కంటే పోలింగ్ మెరుగ్గా ఉందన్నారు. రాష్ట్రం ఎవరి చేతుల్లో సురక్షితంగా ఉంటుందో, బాగుంటుందో మేధావులు, విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఓటు అనేది 5 సంవత్సరాల భవిష్యత్ నిర్ణయించేదన్నారు. పట్టణ ప్రాంత ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు ముందుకు రావాలన్నారు. కొంత మంది పరిధి దాటి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ఇష్యూ పై దానిపై పోలింగ్ ముగిశాక మాట్లాడుతాన‌ని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement