Monday, April 29, 2024

ఫుట్ పాత్ లపై వ్యాపారాలు వద్దు: మంత్రి గంగుల

కరీంనగర్ నగరం లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన నలుగురి కుటుంబాలకు డబుల్ బెడ్రూం గృహాలు మంజూరు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రమాద ఘటన దురదృష్టకరమని, గతంలో ఎన్నోసార్లు ఫుట్ పాత్ లపై వ్యాపారాలు వద్దని చెప్పిన వినడం లేదన్నారు. వీధి వ్యాపారులు అధికారులు సూచించిన ప్రదేశాల్లో వ్యాపారాలు చేసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు గాయపడిన వారికీ రూ.50 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement