Friday, March 29, 2024

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రించిన టీఆర్ఎస్ ఎంపీలు

ఈరోజు ఉద‌యం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు నుంచే నిరసనలు మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ నిర్దేశం మేరకు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి ఎంపీలు దూరంగా ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి గులాబీ పార్టీ ఎంపీలు ఢిల్లీ చేరుకోనున్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోతే పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపలా బయటా పోరాడాలని టీఆర్ఎస్ ఎంపీలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రంపై టీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడి తీసుకురానుంది. విభజన హామీలు,ఆర్ధిక సంఘం సిఫారసులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు,జీఎస్టీ నిధులు సహా 23 అంశాలపై పోరాడాలని సీఎం కేసీఆర్ ఎంపిలకు దిశానిర్దేశం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement