Thursday, May 2, 2024

స్మార్ట్ గా కూడళ్ల సుందరీకరణ పనులు: మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ పట్టణంలో కూడళ్ల సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ మానేరు డ్యామ్ కట్టపై ముఖ ధ్వారా సుందరికరణ కోసం ఐలాండ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ముందంజలో ఉందని మంత్రి పేర్కొన్నారు. దీనికి నిదర్శనం మన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సుమారు వెయ్యి కోట్ల రూపాయల పనులను ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. కరీంనగర్ కు ముఖద్వారమైన లోయర్ మానేర్ డ్యాం కట్ట పైన అందమైన ఐలాండ్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement