Sunday, May 5, 2024

క్రీడలతో మానసికోల్లాసం.. సిపి రెమా రాజేశ్వరి

క్రీడలతో మానసికల్లాసం పెంపొందుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. సోమవారం గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో రామగుండం కమిషనరేట్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా పోటీల వల్ల పోలీస్ శాఖలో అధికారులు, సిబ్బందిలో దాగి ఉన్న ప్రతిభ బహిర్గతం అవడంతో పాటు శారీరకదారుఢ్యం పెంపొందుతుందన్నారు. క్రీడల్లో గెలుపోవటములను సమానంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మంచిర్యాల డీజీపీలు వైభవ్ గైక్వాడ్, సుధీర్, ఏసీపీలు మహేష్, నరేందర్, తిరుపతిరెడ్డి, మోహన్, సదయ్య లతోపాటు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement