Thursday, May 2, 2024

Breaking: గుండెపోటుతో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు మెండు శ్రీ‌నివాస్ మృతి

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు మెండు శ్రీ‌నివాస్ ఇవ్వాల చ‌నిపోయారు. ప‌లు దిన‌ప‌త్రిక‌ల్లో ప‌నిచేసిన ఆయ‌న తెలంగాణ‌లోని జ‌ర్న‌లిస్టులంద‌రికీ సుప‌రిచుతులే. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన మెండు శ్రీ‌న‌వాస్ క‌రీంన‌గ‌ర్ జిల్లాలో వార్త దిన‌ప‌త్రిక‌లోనూ, ఆ త‌ర్వాత ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌లోనూ ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్‌గా శ్రీ‌నివాస్ ప‌నిచేస్తున్నారు. గత 21 ఏళ్లుగా టీఆర్ఎస్ బీట్ న్యూస్ నుంచి ప్ర‌ధాన వార్త‌లు రాస్తున్నారు. ఆదివారం వారి స్వగ్రామం పరకాలలో తీవ్రగుండెపోటుతో ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతూ మృతిచెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement