Thursday, April 25, 2024

దేశాభివృద్ధిలో యువత పాలుపంచుకోవాలి – ఈటెల రాజేందర్

సంగారెడ్డి : దేశాభివృద్ధిలో యువత పాలుపంచుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ఐబీ వద్ద గల వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వివేకానందను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు పోవాలని సూచించారు. దేశాభివృద్ధిలో యువత పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంలో యువత కీలక భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తాలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కొండాపురం జగన్, సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ ఛార్జి రాజేశ్వరరావు దేశ్ పాండే, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement