Thursday, April 25, 2024

ఢిల్లీలో క‌రోనా విల‌య‌తాండ‌వం – 1700మంది పోలీస్ సిబ్బందికి క‌రోనా

క‌రోనా థ‌ర్డ్ వేవ్ విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. కాగా ఢిల్లీలో ప్ర‌తిరోజు 30వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు ఆంక్ష‌ల‌ను విధించింది ఢిల్లీ ప్ర‌భుత్వం. రీసెంట్ గా 1700మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. హోం గార్డుల నుంచి… ఎస్‌ఐలు, సీఐలు, ఉన్నతస్థాయి అధికారులు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జనవరి 12 తేదీల మధ్యలోనే 1700 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్‌ శాఖ ప్రకటించింది. కాగా.. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లోనే… 21,259 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అలాగే నిన్న ఒక్క రోజే 23 మంది కరోనా కారణంగా మరణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement