Friday, May 10, 2024

టిప్పర్, ఆటో ఢీ : మహిళ మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

నర్సాపూర్ : టిప్పర్ ఆటో ఢీకొన్న సంఘటనలో ఓ వివాహిత మహిళ మృతిచెందగా, మ‌రో మ‌గ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన నర్సాపూర్ సమీపంలోని జాతీయ రోడ్డుపై గిరిజన గురుకుల పాఠశాల పక్కన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నర్సాపూర్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఓ టిప్పర్, ప్రయాణికులతో నర్సాపూర్ వైపు వస్తున్న ఆటో గురుకుల పాఠశాల సమీపంలోకి రాగానే ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో నర్సాపూర్ మండల పరిధిలోని ఎల్లారెడ్డి గూడ పంచాయతీ సమీపంలోని జెగ్య తండాకు చెందిన మూడ్ విజయ (31) మృతిచెందగా కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట, మూత్రాజిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నర్సాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement