Wednesday, May 8, 2024

చెట్టును ఢీకొన్న స్కూల్‌ బస్సు.. త‌ప్పిన పెను ప్ర‌మాదం..

స్కూల్ బ‌స్సు చెట్టుకు ఢీకొన్న ఘ‌ట‌న సిద్దిపేట జిల్లా కోహెడ మండ‌లంలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మండ‌లంలోని తంగళ్ల‌పల్లిలో వ‌ద్ద విద్యార్థులను పాఠశాల నుండి ఇంటికి తీసుకెళుతుండగా ప్రైవేట్ బ‌స్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. చెట్టు ప‌క్క‌నే ఉన్న పొలాల్లోకి బ‌స్సు దూసుకెళ్లి ఒక్క‌సారిగా ఆగిపోయింది.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డ ప‌డ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. వెంట‌నే స్పందించిన స్కూల్ యాజ‌మాన్యం ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement