Monday, April 29, 2024

జహీరాబాద్ లో రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి, మహిళకు తీవ్రగాయాలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం గణేష్ పూర్ గ్రామ చౌరస్తా బీదర్ జహీరాబాద్ రహదారిపై కర్ణాటక భాల్కి డిపోకు చెందిన బస్సు జహీరాబాద్ వైపు నుండి బీదర్ వైపు వెళుతున్న మారుతి ఆల్టో AP 09 CL 5468 నెంబరు గల కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే కారులో ప్రయాణిస్తున్న మహిళ తీవ్రగాయాల పాలైంది. స్థానిక ఎస్ఐ వినయ్ కుమార్, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను వెలికి తీస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement